ఏపీలో జూన్ 30తో కర్ఫ్యూ పాత నిబంధనలు ముగిసిపోతాయి. జులై 1నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈమేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1నుంచి రాత్రి 9గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తారు. అయితే ఇవి కేవలం 8జిల్లాల్లోనే అమలవుతాయి. మిగతా 5 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటిలాగే కొనసాగుతాయి. అంటే ఉదయం 6నుంచి సాయంత్రం 6వరకు మాత్రే సడలింపు ఉంటుంది.
నిబంధనల సడలింపు ఈ జిల్లాల్లో..
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
గుంటూరు
నెల్లూరు
కడప
కర్నూలు
అనంతపురం
నిబంధనలు సడలించని జిల్లాలివి..
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
ప్రకాశం
కృష్ణా
చిత్తూరు