ఆమధ్య ఓ కరోనా రోగి.. వైరస్ కంటే పైన తిరుగుతున్న ఫ్యాన్ వల్లే తనకు ఎక్కువ భయంగా ఉందని ఆస్పత్రి నుంచి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అంతకంటే పెద్ద వైరల్ వార్త ఇది. మీరు చూస్తున్నది బీహార్ రాష్ట్రం దర్బంగాలోని ప్రీమియర్ ఆస్పత్రి. పాడుబడిన ఈ ఆస్పత్రిని ఇంకా మూసేయకుండా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఇలాంటి ఆస్పత్రుల్లో ఉంటే కరోనాకంటే ముందే బిల్డింగ్ కూలి చనిపోయే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఏడాదిగా ఈ ఆస్పత్రి గురించి ప్రముఖ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా దాన్ని మూసివేయకుండా బీహార్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే ఉంది. ఇటీవల మరోసారి మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.