కరోనకు కిరోసిన్ విరుగుడు అని ఒక స్నేహితుడు చెప్పిన మాటలు విని, మహేంద్ర అనే టైలర్ కిరోసిన్ తాగి చనిపోయాడు. వారం రోజులైవా జ్వరం తగ్గకుండా ఉండటంతో భోపాల్ శివనగర్ కాలనీకి చెందిన మహేంద్ర కరోన వచ్చిందని భయపడ్డాడు. కిరోసిన్ తాగితే కరోన పోతుందని ఓ స్నేహితుడు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహేంద్ర అరలీటర్ కిరోసిన్ తాగేశారు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో బెడ్లు లేకపోవడంతో రెండు రోజులు ఇంటిదగ్గరే ఉండిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రయివేట్ హాస్పిటల్లో చేర్చారు. కొద్దీ గంటల్లోనే చనిపోయాడు.
విచిత్రం ఏమిటంటే అతడి మృతదేహానికి కరోన పరీక్ష చేస్తే కోవిడ్ నెగెటివ్ వచ్చింది. జ్వరం కరోన వల్లనే వచ్చిందన్న భ్రమలో అతడు చేసిన పిచ్చి పని ప్రాణం బలి తీసుకుంది…కరోనకు కిరోసిన్ విరుగుడు అని ఒక స్నేహితుడు చెప్పిన మాటలు విని, మహేంద్ర అనే టైలర్ కిరోసిన్ తాగి చనిపోయాడు. వారం రోజులైవా జ్వరం తగ్గకుండా ఉండటంతో భోపాల్ శివనగర్ కాలనీకి చెందిన మహేంద్ర కరోన వచ్చిందని భయపడ్డాడు.
కిరోసిన్ తాగితే కరోన పోతుందని ఓ స్నేహితుడు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహేంద్ర అరలీటర్ కిరోసిన్ తాగేశారు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో బెడ్లు లేకపోవడంతో రెండు రోజులు ఇంటిదగ్గరే ఉండిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రయివేట్ హాస్పిటల్లో చేర్చారు. కొద్దీ గంటల్లోనే చనిపోయాడు. విచిత్రం ఏమిటంటే అతడి మృతదేహానికి కరోన పరీక్ష చేస్తే కోవిడ్ నెగెటివ్ వచ్చింది. జ్వరం కరోన వల్లనే వచ్చిందన్న భ్రమలో అతడు చేసిన పిచ్చి పని ప్రాణం బలి తీసుకుంది…