తిరుమలలో ఇక నుంచి వారానికి మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. ఇకనుంచి శుక్ర , శని , ఆదివారాలు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు.. విఐపి బ్రేక్ దర్శనాలు సమయాన్ని సామాన్య భక్తుల దర్శనాలకు కేటాయిస్తారు.
ఇటీవల కాలంలో విఐపి దర్శనాలు తిరుమలలో ఎక్కువ కావడంతో , సామాన్య భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఈ విషయమై తీవ్ర అనంతృప్తి కూడా ఉంది.. అందువల్ల ఎట్టకేలకు ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో , దాదాపు మూడు గంటలు సమయం సామాన్య భక్తులకోసం కేటాయించినట్టు అవుతుంది.