అందరూ ఎదురు చూస్తున్న ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్లో ఇగ్నీషన్ మన మొబైల్లో ప్రోగ్రాం చేసుకోవచ్చు.. స్కూటర్ లాక్ , అన్ లాక్ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెన్నైలో ఆవిష్కరించిన ఈ స్కూటర్ ఒక్క దఫా ఛార్జ్ చేస్తే 181 కిలోమీట్లర్లు మైలేజి ఇస్తుంది. సెకన్ల లో 115 కిలోమీటర్ల మాక్జిమమ్ స్పీడ్ అందుకోవచ్చు. దీనిలో రివర్స్ గేర్ ప్రత్యేకత ఉంది.. ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు., బిల్ట్ ఇన్ స్పీకర్స్, స్మార్ట్ ఫోన్తో లాక్-అన్లాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. బిల్ట్ ఇన్ స్పీకర్లు తో ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయొచ్చు. ఒక లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల మధ్య ఉండే ధరలో ఓపెనింగ్ రాయితీలు భారీగానే ఉన్నాయి..