టీడీపీలోనుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి చేజిక్కించుకున్న నాయకుడాయన. మాస్ లీడర్ గా పేరుంది కానీ, భాష వాడటంలో మాత్రం ఇంకా పద్ధతి నేర్చుకోలేదనిపిస్తుంది. ఇలా ఓ బహిరంగ వేదికపై మహిళా ఎంపీడీవోని కించపరిచేలా మాట్లాడారు. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మహిళా ఎంపీడీవోపై మంత్రి అనుచిత వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఎర్రబెల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
#Telangana Panchayat Raj Minister Errabelli Dayakar Rao passed problematic remarks on a female official working as Kamalapur MDPO during a Palle Pragathi Grama Sabha meeting in Warangal on Friday. pic.twitter.com/3LLvQ6krEI
— TNIE Telangana (@XpressHyderabad) July 9, 2021
ఇవీ చదవండి..