మన రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేశారు. గత ఏడాదే ఈ మార్పులు చేసినా , కోవిడ్ కారణంగా పరీక్షలు జరపకపోవడంతో వాటిని రద్దుచేశారు. ఇప్పుడు గత ఏడాది జిఓ నే అమలులోకి తెచ్చారు. 11 పరీక్షా పేపర్లకు బదులు , ఏడు పేపర్లు మాత్రమే రాయాల్సిఉంటుంది. ఒక్క సైన్స్ మినహా , మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ ఒక్కో పేపర్ ఉంటుంది. కొత్త విధానంతో 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుపుతారు . కొవిడ్-19 కారణంగా విద్యార్థుల మానసిక ఆందోళన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం పేర్కొంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో కూడా 7 పేపర్లే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది..