ఏమిటివి..? నదిలో ,కాలువలో దొరికే రాళ్లు కాదు.. రోడ్డుమీద కంకరకూడా కాదు.. కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు.. ఒకటా , రెండా.. కానేకాదు.. మొత్తంకలిపి 206 రాళ్లు.. ఇన్ని రాళ్లు ఇంతకాలం వీరమల్ల రామలక్ష్మయ్య అనే వ్యక్తి కిడ్నీలోనే భద్రంగా ఉన్నాయి..
కడుపు నొప్పి భరించలేక . నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. గత ఆరునెలలలుగా అతడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. రామలక్ష్మయ్యకి పరీక్షలు చేయగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు.
ఈ రాళ్ళన్నీ ఎడమవైపున ఉన్న కిడ్నీలోనే ఉన్నాయి.. దీంతో ఎల్బీనగర్ లోని అవేర్ హాస్పిటల్లో యూరాలజీ డాక్టర్ పూల సురేశ్కుమార్ అతడికి బటన్ హోల్ సర్జరీ చేసి 206 రాళ్లను తొలగించారు..