ఎలక్ట్రిక్ స్కూటర్లు , ఎలక్ట్రిక్ బైక్ లు భద్రత పై తీవ్రమైన చర్చ జరుగుతోంది . తాజాగా నాసిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్ లు కాలిపోవడంతో ఈ విషయమై సంచలనం రేకెత్తించింది . దీంతో కేంద్ర ప్రభుత్వం అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఐఐటి నుంచి సమగ్రమైన నివేదిక కోరింది . పరిశ్రమకు సంబంధించిన పరిశోధన సంస్థలు కూడా ఈ విషయమై నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాసిక్ లో జితేంద్ర ఈవి స్కూటర్ కంపెనీ నుంచి 40 స్కూటర్లు కంటైనర్లో బయట పోతున్నాయి . ఫ్యాక్టరీ గేట్ దాటిన వెంటనే అందులో 20 స్కూటర్లు తగలబడి పోయాయి . ఇవన్నీ కూడా బ్యాటరీలు పేలిపోయి తగలబడ్డాయి అని తేలింది .
ఏప్రిల్ 9 వ తేదీ జరిగిన ఈ సంఘటనతో ఆందోళన నెలకొంది. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే సమయంలో 40 స్కూటర్లలో , ఇరవై కాలిపోగా మిగిలిన వాటి భద్రత ఏమిటన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది . దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలు పెనుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయమై తీవ్రంగా పరిశీలన జరపాలని కోరింది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో లోపం ఏంటో గమనించి నివేదిక ఇవ్వాలని కోరింది . అంతవరకూ కంపెనీలు కూడా స్కూటర్లు తయారీ మోటార్ సైకిల్ తయారీ లో జాగ్రత్త వహించాలి అని స్పష్టం చేసింది.
మార్చి 26వ తేదీన పూనాలో ఒక ఓలా స్కూటర్ కాలిపోయింది . ఈ సంఘటన తర్వాత రోజు తమిళనాడులోని వెల్లూరు లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ పేలి తండ్రి , 13 ఏళ్ల కూతురు చనిపోయారు. ఆ తర్వాత మరొక సంఘటన స్కూటర్ బ్యాటరీ పేలి 60 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడు . ఒక దాని వెంబడి ఒకటిగా స్కూటర్లు బ్యాటరీలు పేలి పోతుండడంతో ఆందోళన నెలకొంది . తాజాగా జరిగిన ఆ సంఘటనతో అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపైనే అనుమానాలు నెలకొన్నాయి .
ఎండాకాలంలో ఎలెక్ట్రిక్ స్కూటర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇంజనీర్లు చెబుతున్నారు.. ఇండియాలో ఈవీ వెహికల్స్ మార్కెట్ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇలా నాలుగింతలు మార్కెట్ పెరిగిన తరుణంలో ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నాసిక్లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈవీ స్కూటర్లకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా నమోదు అయ్యింది.
WATCH | Biggest ever EV fire incident in the country! 20 electric scooters from Jitendra EV catch fire in Nashik | https://t.co/Xb6dS17UTa pic.twitter.com/esw2TqGgTr
— Economic Times (@EconomicTimes) April 11, 2022