ఆన్ లైన్లో వదినతో లూడో గేమ్ ఆడి , ఆమెతో సహజీవనానికి సిద్దమయ్యాడో మరిది.. తర్వాత వాడి మాయలకు , మోసాలకు ఆమె పోలీసులవద్దకెల్లింది. జోధ్ పూర్ లో నీతూ అనే మహిళ ఎనిమిదేళ్ళక్రితమే భర్తనుంచి విడిపోయింది.. ఆమె ఎక్కడుందో భర్తకూ తెలియదు. ఆరు నెలలక్రితం మరిది ప్రవీణ్ కు ఆన్ లైన్ లో పరిచయమైంది. లూడో గేమ్ ఆడేందుకు ఏర్పడ్డ పరిచయం , చిన్నగా , చాటింగ్ , ఫ్రెండ్ షిప్ , తర్వాత ప్రేమకు దారితీసింది.. నీతూ , తన చిన్నప్పుడు , అన్నను వదిలేసిన వదిన అని తెలిసినా , ప్రవీణ్ ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు.. ఇద్దరూ సహజీవనం కూడా మొదలు పెట్టారు.. పెళ్ళిచేసుకోవాలని ఏర్పాట్లుకూడా చేసుకున్నారు. అయితే ఈ లోగా , ప్రవీణ్ అదృశ్యమయ్యాడు.. ఆమె పోలీసులవద్దకెళ్లి ఫిర్యాదు చేసింది.. భర్తకు విడాకులు ఇవ్వకుండా , మరిదితో పెళ్లేమిటని పోలీసు మందలించి పంపేశారు.. అయినా లూడో గేమ్ లో మొదలైన లవ్ పెళ్ళితోనే ముగియాలని ఆమె పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడంతో , పోలీసులు కేసు నమోదుచేసి పంపేశారు..
ఇవీ చదవండి..