సినీ నటుడు , క్రిటిక్ కత్తి మహేష్ వైద్య చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు విడుదలచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ , సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు జాతీయరహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న వాహనం , ట్రక్కును ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి ఆయనను చెన్నైకి తరలించి చికిత్స చేయిస్తున్నారు.