ముంబైలో ఇద్దరు మహిళలు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిద్దరూ అమ్మాకూతుళ్ళే. మలాడ్ ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో కారును అడ్డంగా పార్క్ చేశారు. అదీకాకుండా విండోస్ కి బ్లాక్ ఫిల్మ్ అంటించారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు పార్కింగ్ వద్దకు వచ్చి కారును అడ్డంగా పార్క్ చేయడంపై, విండోస్ కి బ్లాక్ ఫిల్మ్ అంటించడంపై ప్రశ్నించారు. దీంతో అమ్మాకూతుళ్ళు ఇద్దరూ కలిసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. నానా రభస చేసి భీభత్సం చేశారు. ఆ సమయంలో మఫ్టీలో ఉన్న లేడీ మహిళపై తెగబడ్డారు. చివరికి వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కి తరలించారు. ఇటీవలకాలంలో కొంతమంది మహిళలు తాగిన మత్తులో, అహంకారంతోనో ఆటోవాలాలపై, క్యాబ్ డ్రైవర్లపై విరుచుకుపడిన ఘటనలు చూశాం. ఇప్పుడు పోలీసులపై కూడా దాడులకు పాల్పడుతున్నారు.
#Watch: #MotherDaughter duo booked for assault on cops in #Malad#FPJCrimeNews @MumbaiPolice #CrimeNews @DGPMaharashtra pic.twitter.com/KfaFZEpX6t
— Free Press Journal (@fpjindia) October 28, 2021