భార్యాభర్తల మధ్య తగాదా భర్త ప్రాణంమీదకు వచ్చింది. భార్యతో గొడవపడి , నిద్రపోయిన భర్త పై భార్య సలసల కాగే వేడినీళ్లు పోసింది. అదికూడా పొట్టకి దిగువభాగంలో పోయడంతో ఆ శరీరభాగంలో కడుపునుంచి , తొడలవరకు కాలిపోయింది. పూర్తిగా కమిలిపోయాయి. భర్త బంధువులు అతడిని హాస్పిటల్లో చేర్చారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్టోబర్ 15 అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. చోటు చేసుకుంది . ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సీఐ ఆది ప్రసాద్ ,ఎస్సై కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు . బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్లో టైలర్ గా పని చేస్తున్నట్లు సమాచారం .భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..