సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ నుంచి బయటకొచ్చిన పట్టాభి ఇప్పుడు ఎక్కడున్నారు..? ఆయన మాల్దీవ్స్ కి వెళ్లారని, ప్లైట్ లో ఉన్న ఫొటోలు చూడండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు.
వైసీపీ వాళ్లు విపరీతంగా ఈ ఫొటోలు సర్క్యులేట్ చేస్తున్నారు. పనిలో పనిగా సోషల్ మీడియాలో వేర్ ఈజ్ పట్టాభి అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు. అసలింతకీ పట్టాభి ఎక్కడికెళ్లారు.. ? మాల్దీవ్స్ కి వెళ్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? అవి పాత ఫొటోలా..? పోనీ పట్టాభిని చంద్రబాబు వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారంటే అదోలెక్క. కానీ అక్కడికెళ్లకుండా పట్టాభి మాల్దీవ్స్ ఎందకెళ్లినట్టు.
సాధారణంగా పెళ్లైన కొత్త జంట మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్తారు. జైలునుంచి బయటకొచ్చిన పట్టాభి కూడా ఇప్పుడు అలా రిలాక్స్ అవడం కోసం మాల్దీవ్ వెళ్లారా..? అసలీ ప్రచారంలో నిజమెంత..? ఈ ఫొటోల్లో వాస్తవం ఎంత..?