అక్కడున్నవారంతా మహిళలే. చదువుకున్నవారే. స్టైల్ గా చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని చూస్తూ కూర్చున్నారు. అయితే ఓ అమ్మ చంటి బిడ్డను ఎత్తుకుని అక్కడ సీటు దొరక్క, నిలబడేందుకు ఓపిక లేక మెట్రో ట్రైన్ లో కిందే కూర్చునిపోయింది. ఆమెను చూసి కూడా పక్కన ఉన్న మహిళలు కనీసం సీటు ఇవ్వాలని అనుకోలేదు. ఆమెవైపు చూస్తే ఎక్కడ సీటు ఇవ్వాల్సి వస్తుందోనని చూసీ చూడనట్టు ఉండిపోయారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్థానంలో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి.
Friends Where we are Going..??
What is the use of Studying without learning common sense..?? pic.twitter.com/md41AZV2CE
— Pichhi Puvvu | BrainLess Flower (@PichhiPuvvu56) October 24, 2021