టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్తో పాటు ర్యాపిడో సంస్థకు సజ్జనార్ నోటీసులు పంపారు. ప్రజా రవాణా వ్యవస్థను సాదా దోసె లాగా , ప్రయివేట్ రవాణా వ్యవస్థను మసాలా డోసె లాగా పోల్చి కించపరచడం మంచిదికాదన్నారు..
ఒకరి గొప్పతనాన్ని మరొకరిని కించపరచడం సంస్కారంకాబోదని కూడా చెప్పారు. యూట్యూబ్లో వస్తున్న ఒక ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది..