వచ్చే ఏడాదికాలంలో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి.. 35 సీట్ల సామర్ధ్యంతో నడిచే ఈ బస్సులు అన్నీ ఎయిర్ కండిషన్ బస్సులే.. తిరుపతికి 100 బస్సులకోసం ఆర్టీసీ 140 కోట్లరూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
12 ఏళ్లపాటు వాటి మెయింటినెన్స్ కూడా బస్సులు సరఫరాచేసే ఓలెక్ట్రా సంస్థే చూసుకుంటుంది. 100 బస్సుల్లో తిరుమలకు 50 , నెల్లూరు , కడప, చిత్తూర్ , మదనపల్లికి మరో 50 బస్సులను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బస్సులుగా నడుపుతారు..