చేపల లారీ బోల్తాపడితే , ఇక చెప్పాలా ?

    0
    671

    8 ట‌న్నుల లారీలో స‌రుకును ఖాళీ చేయాలంటే ఎంతసేపు స‌మ‌యం ప‌డుతుందో తెలుసా? క‌నీసం నాలుగు గంట‌లు 30 మంది కూలీలు క్రేన్ల‌తో ప‌ని చేస్తే అన్ లోడ్ చేయ‌గ‌ల‌రు. అలాంటిది 8 ట‌న్నుల స‌రుకును అర‌గంట‌లో జ‌నం మాయం చేసేశారంటే.. ఉచితంగా వ‌స్తే ఎంత బాగా ప‌ని చేస్తారో దీన్ని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు.

    తెలంగాణ‌లోని కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండ‌లం ఐటీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద ఓ చేప‌ల లారీ బోల్తా ప‌డింది. ఈ లారీలో ఒక్కోటి రెండు కేజీల చేప‌లు 8 ట‌న్నులు ఉన్నాయి. 8 ట‌న్నుల చేప‌ల లారీ బోల్తా ప‌డ‌డంతో.. చేప‌ల‌న్నీ రోడ్డు మీద ప‌డ్డాయి.

    దీంతో స్థానికులు దీన్ని చూసి ప‌రుగులు తీశారు. అర‌గంట వ్య‌వ‌ధిలో చేప‌లు మొత్తం ఖాళీ చేసేశారు. ఎంత వెదికితా ఒక్క చేప కూడా లేకుండా తీసుకెళ్ళిపోయారు. అర‌గంట సేపు ఆ రోడ్డులో ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. చేప‌ల కోసం ఎగ‌బ‌డ్డ జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డం పోలీసుల వ‌ల్ల కూడా కాలేదు.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..