పద్మశ్రీ స్వీకారంలో హిజ్రా రాష్ట్రపతిని చీర కొంగుతో ఇలా దీవించిన సంఘటన నిజంగా సంచలనమే.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి పద్మ అవార్డుల విషయంలో సంచలన మార్పులు చేసింది. గతంలో మాదిరి ఉన్నతస్థానాల్లో ఉన్నవారు , పలుకుబడిగలిగిన వారికేకాకుండా , క్షేత్రస్థాయిలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికీ పద్మ పురస్కారాలు ఇస్తోంది..
ఈ క్రమంలో , జానపద నృత్య కళాకారిణి , హిజ్రా కూడా అయిన మాత మంజమ్మ జోగతికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు స్వీకారానికి రాష్ట్రపతి చెంతకు వెళ్లిన మంజమ్మ , హిజ్రా స్టయిల్లోనే , చీరె కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది.. ఈ కొత్త రకం ఆశీర్వాదంతో , ప్రధానితోసహా అందరూ అలాగే , ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.. తరువాత అబినందనగా కరతాళధ్వనులు చేశారు..
President Ram Nath Kovind confers Padma Shri on
Matha B. Manjamma Jogati, a transgender folk dancer of Jogamma heritage, and the first transwoman President of Karnataka Janapada Academy.#PadmaAwards2021 #PeoplesPadma pic.twitter.com/kqYd4kSfkx— All India Radio News (@airnewsalerts) November 9, 2021