అతడికోసం రాష్ట్రపతి రెండుమెట్లు దిగి వచ్చాడు.. అతడే కేవై . వెంకటేష్.. అతడో మరుగుజ్జు.. అయినా చాలా క్రీడల్లో ఛాంపియన్.. కర్ణాటకకు చెందిన వెంకటేష్ ఎత్తు నాలుగు అడుగులే.. నాలుగో ప్రపంచ మరుగుజ్జుల గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలు గెలిచాడు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించాడు. 1994 లోనే జర్మనీలో పారాఒలింపిక్స్ లో పాల్గొని మెడల్స్ గెలిచాడు. హాకీ , ఫుట్ బాల్ , వాలీబాల్ , బ్యాడ్మింటన్ క్రీడల్లో ఛాంపియన్.. 44 ఏళ్ళ ఈ మరుగుజ్జు క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు అందుకునేందుకు వచ్చినప్పుడు , రాష్ట్రపతి స్వయంగా , తానే రెండు మెట్లు దిగి , ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు..
Fabulous feeling to see these trailblazers receiveg the country’s highest civilian honors. Congratulations Shri Venkatesh.Truly inspirational. #PeoplesPadma #Padmashri #PadmaAwards2021 pic.twitter.com/8F5yp2sz9S
— Supriya Sahu IAS (@supriyasahuias) November 10, 2021