సీమంతం సిద్ధమైంది..పుత్తడి బొమ్మ ఉరేసుకుంది..

    0
    537

    కొన్ని సంఘటనలు వింటేనే జీర్ణించుకోవడం కష్టం.. సీమంతానికి తల్లితండ్రులు ఏర్పాట్లు జరుగుతుండగానే , ఓ నిండుచూలాలు ఉరితాడుకి వెల్లడింది.. కడుపులో బిడ్డతోసహా ప్రాణం తీసుకుంది. గత ఏడాదే రాయచూర్ కి చెందిన నిర్మలకు లోకేష్ అనే యువకుడితో పెళ్లయింది. పెళ్ళైనప్పటినుంచి అదనపు కట్నం కోసం భర్త , అత్తమామలు వేధిస్తున్నారు. అయినా అన్నిబాధలు తట్టుకొని నిలబడింది. గర్భం వచ్చి నెలలు నిండటంతో తల్లితండ్రులు , సీమంతం కోసం ఇంటికి తీసుకొచ్చారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త , అత్తమామలు డబ్బులిస్తేనే సీమంతానికి వస్తామని చెప్పారు. భర్త కళ్లెదుట లేకుండా సీమంతం ఎందుకన్న బాధలో , నిర్మల గదిలోకి వెళ్లి ఉరేసుకుంది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..