అమితాబ్ లాంటి అత్యున్నతస్థాయి నటుడు కూడా డబ్బుకు గడ్డితిని పాన్ మసాలా ప్రకటనలకు దాసోహం కావడం ఒక్క సారిగా సంచలనమైంది. అయన అభిమానులు , జాతీయస్థాయిలో పొగాకు ఉత్పత్తుల వ్యతిరేకసంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోట్లాదిమంది అభిమానులున్న అమితాబ్ లాంటి వాళ్ళు పాన్ మసాలా ఉత్పత్తుల ప్రమోషన్ కు , సహకరిస్తే ఇక దిక్కెవరని ప్రశ్నించారు. యువత అమితాబ్ ప్రకటనలు చూసి , పాన్ మసాలాకు బానిసలైతే వారి ఆరోగ్యం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో అమితాబ్ వెనక్కి తగ్గారు. పాన్ మసాలా ప్రకటన నిషేదిత వస్తువులను ప్రమోట్ చేసినట్టు అవుతుందని చెప్పడంతో , ఆయన పాన్ మసాలా ప్రమోషన్ యాడ్ కాంట్రక్టు రద్దుచేసుకొని , తీసుకున్న అడ్వాన్స్ డబ్బు వెనక్కి ఇచ్చేశారు. గతంలో షారుక్ ఖాన్ , అజయ్ దేవ్ గన్ , రణవీర్ సింగ్ , హృతిక్ రోషన్ కూడా పాన్ మసాలా ప్రమోటర్లు గా యాడ్స్ కి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు..