వాళ్ళంతా బెంగుళూరు ఐబీఎం లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. తిరుమలకు బయలు దేరారు.. డ్రైవింగ్ సీట్లోఉన్న కిరణ్ తప్ప , మిగిలిన అమ్మాయిలంతా ముచ్చట్లలో మునిగిఉండగా కారు చెట్టును ఢీకొంది.. ఒక యువతి మరణించగా మిగిలిన వారు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలంలో వ్యాలీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీళ్లంతా మదనపల్లె రూరల్ మండలం అడ్డగింటివారిపల్లెకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి తిరుమలకు బయలుదేరారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన అనూష , వైష్ణవి, ప్రియాంక , కృష్ణాజిల్లా కొడాలికి చెందిన రమ్య , అమలాపురానికి చెందిన శ్వేత కారులో ఉన్నారు. ప్రియాంక అక్కడికక్కడే మరణించింది. వైష్ణవి, అనూష, రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. శ్వేత, కారు నడుపుతున్న కిరణ్కు స్వల్పగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే యత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొందని చెబుతున్నారు.