శ్రీ రామాయణ్ యాత్ర లగ్జరీ ట్రైన్ గురించి తెలుసా ? చాలామందికి తెలియకపోవచ్చు. విశాలవంతమైన ఈ ట్రైన్ ఈరోజే బయలుదేరింది. ఈ రైలు గురించి చాలామందికి తెలియదు. ఇది ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ చేయని ఆధ్యాత్మిక ప్రయోగం శ్రీ రామాయణ్ యాత్ర లగ్జరీ ట్రైన్.
రామాయణ పురాణంతో సంబంధం ఉండి, రాముడి క్షేత్రాలుగా ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ రైలు ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి బయలుదేరి అయోధ్య, వారణాసి, ప్రయాగ రాజ్, చిత్రకూట్, సీతామరి, హంపీ మరియు రామేశ్వరం క్షేత్రాలకు ఈ రైలు వెళుతుంది. ఈ రైలులో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
టిక్కెట్ ధర 82వేలరూపాయలు. పూర్తి ఏసీ, సింగిల్ పుషప్ సీట్స్, కర్టెన్స్, బెడ్ లైట్స్, ఎక్కడికక్కడ విశాలమైన కూపేలు, సెపరేట్ డైనింగ్ రూమ్స్, ఇద్దరు మాత్రమే పడుకునేందుకు వీలుగా రెండు బెర్తులు, డ్రెస్సింగ్ రూమ్స్, ఇలా విలాసవంతమైన ఇల్లు లాగే రామాయణ యాత్ర స్పెషల్ డ్రౌన్ ఉంటుంది. టిఫిన్ భోజనం, స్నాక్స్ అన్నీ కలిపి కేవలం 82 వేలరూపాయలు మాత్రమే.