కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె, షానెల్లీ.. పెళ్లి నిశ్చయమైంది. అర్జున్ భల్లా అనే యువకుడితో ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు
షానెల్లీకి అర్జున్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. అర్జున్ మోకాళ్లపై కూర్చుని, షానెల్లీకి ప్రపోజ్ చేసి, ఎంగేజ్ మెంట్ రింగ్ ఇస్తున్నాడు.
.ఆ యువకుడిని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని స్మృతి చెప్పారు. షానెల్లీ కాకుండా శ్మృతి ఇరానీకి మరో ఇద్దరు పిల్లలన్నారు. జవహర్, జోయిష్.. వీరిద్దరూ జుబిన్ ఇరానీకి కలిగి నంతానం. షానెల్లీ.. స్మృతి మొదటి భర్త మోనో ఇరానీ కుమార్తె.