అత్యంత ఖరీదైన 4 వేల కార్లతో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. నౌకలోని కార్లు తగలబడిపోయాయి.. వీటిలో బెంట్లే , పోర్ష్ , ఆడి , బెంజ్, లాంబోర్గిని కార్లు ఉన్నాయి. కొన్ని ఎలెక్ట్రిక్ కార్లుకూడా ఉన్నాయి. కార్లలోని లిథియం ఇయాన్ బ్యాటరీల కారణంగా , మంటలు ఇప్పుడే తగ్గేఅవకాశం లేదని చెప్పారు. పోర్చుగల్ లోని అజొరాస్ దీవుల్లో ఈ ప్రమాదం జరిగింది. నౌక అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే , నౌకలోని 27 మంది సిబ్బందిని రక్షించారు.