అయోధ్యలో రామమందిరానికి ఒక అపురూపమైన శిల ను శ్రీలంక ప్రభుత్వం బహుమతిగా పంపింది. రావణాసురిడి రాజ్యమైన లంకలోని అశోకవనంలో సీతామందిరంలో ఉన్న సీతమ్మవారి శిలను , శ్రీలంక రాయబారి రామ జన్మభూమి కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహంతులు , అధికారులు , మంత్రులు పాల్గొన్నారు.
రామజన్మభూమిలో కట్టే , రామమందిరానికి ఈ శిలా ప్రతిష్ట ఎంతో ప్రధానమైనది. రామాయణంలో సీతాపహరణం , అశోకవనంలో సీతమ్మ, రావణసంహారం ముఖ్య ఘట్టాలు.. అశోకవనంలో సీతమ్మ విగ్రహం కోసం ఎంతోకాలంగా రామజన్మ భూమి కమిటీ ప్రయత్నం చేస్తోంది.. ఇప్పుడు అది నెరవేరడంతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది..