హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ వార్తలకెక్కింది.. నాగచైతన్యతో విడాకుల తరువాత ఆమె పోస్టులలో ధిక్కారమే కనిపించేది.. తరువాత తాజాగా , దేశంలో నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన చేసింది.. స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రలో రిషి కేష్ , కేదార్ నాధ్ , బదిరినాధ్ సందర్శించింది.. ఇప్పుడు విదేశీ టూర్ కి బయలుదేరింది.. దీంట్లో విశేషం ఏమిటో తెలుసా ..? తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దుబాయ్ విమానమెక్కి , తన సోషల్ మీడియా అకౌంట్లో ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. నాగచైతన్యకు , ఆమెకు మధ్య విభేదాలు రావడానికి ప్రీతమ్ కారణమని ప్రచారం హోరెత్తింది.. గతంలో వారిద్దరూ కలిసిఉన్న ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి.. ఇప్పుడు , మళ్ళీ అతడితోనే సమంత విదేశీ యాత్రలకు పోవడంతో సంచలనమైంది..