ఆటో కావాలంటే ఇంటి దగ్గరకే వస్తుంది, ఈమధ్య కాల్ ట్యాక్సీ సర్వీసులు కూడా ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఇంటి వద్దకే వచ్చేందుకు కొత్తగా నిబంధనలు మార్చుతున్నారు. అయితే ఎవరింటికి వెళ్లి వారింటి వద్ద ఒక్కొక్కరినే ఎక్కించుకోరు. కనీసం 30మంది ఒకచోటకు వచ్చి ఆర్టీసీ డిపోకి ఫోన్ చేశారంటే.. నేరుగా బస్సునే వారున్న ఏరియాకి, లేదా వారి ఇంటి వద్దకు పంపిస్తారు.
30 మంది ఉంటే మీ ఇంటి వద్దకే #TSRTCBus సౌకర్యం కలదు. #TSRTCBusAtDoorstep@TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @HiHyderabad@dpveu_official @sivacherry9 @iAbhinayD @RameshVaitla @ntdailyonline @NtvTeluguLive @abntelugutv @10TvTeluguNews #wednesdaythought @dineshakula pic.twitter.com/pBVNFIRW6D
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 12, 2022
అయితే ఇది ఏపీలో కాదు, కేవలం తెలంగాణలో మాత్రమే. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ పలు వినూత్న పథకాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. పండగ సీజన్లో స్పెషల్ బస్సులకు కూడా చార్జీలు పెంచకుండా అందరి మన్ననలు అందుకున్నారు టీఎస్ఆర్టీసీ అధికారులు. తాజాగా ఇప్పుడు ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.