కోమాలో ఉన్న ఒక మహిళా వయాగ్రాతో లేచిందన్న వార్తాఒకపక్క సంచలనం రేపుతుంటే, ఇప్పుడు కోవిద్ వాక్సిన్ వేస్తూనే , ఐదేళ్లుగా మాట పోయి, కాళ్ళు చచ్చుబడి మంచానపడ్డ ఓ వృద్ధుడు , లేచి నిలబడి , మాట్లాడుతున్నాడన్న వార్త మరో సంచలనం అయింది. అయింది. జార్ఖండ్ లోని , బొకారోకి 40 కిలోమీటర్ల దూరంలో సెల్దాది గ్రామంలో దులారాచంద్ ముండా అనే 55 ఏళ్ళ వ్యక్తికీ ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది. అప్పటినుంచి నోరు పడిపోయింది. కాళ్ళు చచ్చుబడిపోయాయాయి. మంచాన ఉన్నాడు, వారం క్రితం అతడికి పేటవారి కమ్మ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది , వాక్సిన్ వేశారు. మరుసటి రోజు ఆశ్చర్యంగా , అతడు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ విషయం తెలిసిన బొకారో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారి , డాక్టర్ జితేంద్ర భాస్కర్ గ్రామానికి వచ్చి విచారణ చేశారు. ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఐదేళ్లుగా మంచానపడ్డ వ్యక్తి , వాక్సిన్ ఇచ్చిన మరుసటిరోజే లేచాడని , మాటకూడా వచ్చిందన్న విషయం నిజమే అయినా , అది వాక్సిన్ వల్లనే అని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే వాక్సిన్ ఇచ్చిన మరుసటిరోజే ఈ అద్బుతం జరిగిందన్నారు. దీనిపై మరింతగా పరిశీలన జరగాలన్నారు..