తమిళనాడులో ఉదృత జలపాతం మధ్య చిక్కుకున్న తల్లీకూతుళ్లని కాపాడిన అటవీసిబ్బంది సాహసం , నిజంగా థ్రిల్లర్ సినిమాను తలపించే సాహసోపేత చర్యే.. ఈ విషయం వీడియో చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వారిని అభినందించి , ప్రభుత్వం తగిన విధంగా వారిని గుర్తిస్తుందని చెప్పారు. సేలం జిల్లాలోని అనైవరి ముత్తాల వాటర్ ఫాల్స్ ఆవలివైపు , ఒక మహిళాబిడ్డని తీసుకొని , కొండరాయిపై కూర్చుని , ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది.. ఇంతలో నీటి ఉదృతి ఎక్కువై చుట్టుముట్టింది. ఇవతలవైపు వారి కేకలతో ఆ మహిళ కొండపైకి పోయేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు.. ఇవతలివైపుకు రాలేదు.. దీంతో ఇద్దరు అటవీ సిబ్బంది , చెట్ల వేళ్ళు , కొమ్మల సాయంతో దిగి , వాళ్లకు తాడు అందించి , అతికష్టంమీద కాపాడారు. వారికి సాయంచేసిన ఇద్దరు , నీళ్లలో పడిపోయినా , కొంతదూరం వరకు ఈత కొట్టుకుంటూ పోయి , గట్టుకు చేరుకున్నారు.. తల్లి కూతుళ్లను , రక్షించే ఈ వీడియో మాత్రం క్షణక్షణం సస్పెన్స్ గా ఉంది.. చూడండి..
"தாயையும் சேயையும் காப்பாற்றியவர்களின் தீரமிக்க செயல் பாராட்டுக்குரியது; அரசால் சிறப்பிக்கப்படுவார்கள்.
தன்னுயிர் பாராது பிறரது உயிர் காக்க துணிந்த அவர்களது தீரத்தில் மனிதநேயமே ஒளிர்கிறது! " என மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் தெரிவித்துள்ளார். pic.twitter.com/phJWrYLCwi
— CMOTamilNadu (@CMOTamilnadu) October 26, 2021
ఇవీ చదవండి
సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .
చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?
డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..