ఇఫీలో పాల్గొనాలని సమంతకు ఇన్విటేషన్…
================
టాలీవుడ్ బ్యూటీ సమంతకు అరుదైగన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రసంగించేందుకు రావాలంటూ ఇన్విటేషన్ అందింది. ఈ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ గా శామ్ రికార్డులకెక్కింది.
ఈ నెల 28 నుంచి 30 వరకు గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. సమంతతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్, దర్శకులు అర్జున్ రాజే, వివేక్ అగ్నిహోత్రి, నటుడు జాన్ ఎతత్తిల్ కూడా ఆమెతోపాటు ప్రసంగించనున్నారు. డైవర్స్ ప్రకటన చేసిన తర్వాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న శామ్… ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.