అఖండ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కి రెండో దఫా కరోనా అటాక్ అయింది. ఇటీవలే అఖండ షూటింగ్ పూర్తిచేసుకొని , బాలకృష్ణ టీమ్ తో సెలెబ్రేట్ చేసుకుంది. ఆమెకు కరోనా సోకడం ఇది రెండో పర్యాయం.. ఇదివరకే రెండో డోస్ లు వాక్సిన్ కూడా వేయించుకున్నానని చెప్పింది. అయితే గత కొన్నిరోజుల నుంచి జలుబు, జ్వరం, నీరసంతో బాధపడుతున్నాన్నని చెప్పింది. డాక్టర్లు టెస్ట్ చేసి , కరోనా పాజిటివ్ గా నిర్దారించారని తెలిపింది. ఇంటివద్దే డాక్టర్ల సలహా ప్రకారం మందులు వాడుతున్నానని చెప్పింది. గత 10 రోజుల్లో తనను కలిసిన వారుకూడా కరోనా పరీక్షలు చేయించుకోమని కోరింది..