ఇప్పుడే మీరు బైక్ లో పెట్రోల్ కొట్టించుకుని వచ్చారా, కారులో ఫుల్ ట్యాంక్ చేయించారా..? అయితే మీరు నష్టపోయినట్టే. ఎందుకంటే రేపటినుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గుతాయి. ప్రజలకు దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్పై రూ.5లు, లీటరు డీజిల్పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు రేపటి నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పెట్రోల్ కంటే రెట్టింపు ఉండటంతో రాబోయే రబీ సీజన్లో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది.