హుజురాబాద్ వీణవంక మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైన ధూమ్ ధామ్ కార్యక్రమంలో తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరగా , పోలీసులు తనపై దాడి చేశారని నిరోషా. అనే యువతి ఆరోపించింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండని అడిగేందుకు పోతుంటే , అడ్డుకున్నారని చెప్పారు. బీజేపీ వాళ్ళు తనకు 10 లక్షలు ఇచ్చి మీటింగ్ దగ్గరకు పంపారని ఒక టార్ ఎస్ వ్యక్తి చెబితే , తనను పోలీసులు తన మెడలో చైన్ తెగిపోవడమే గాక , కొట్టిన దెబ్బలకు చేతులు,కాళ్ళకి గాయాలయ్యాయని చెప్పింది.. ఈ మేరకు నిరోషా సెల్ఫీ వీడియో విడుదల చేసింది..