ఆశ్రమంలో జగన్..
శాలువా కప్పిన స్వామిజీ.. ఎందుకంటే..?
=======================
విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు సీఎం జగన్.. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను సచ్చిదానంద స్వామి శాలువాతో సత్కరించారు.