పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నా.. ఏపీకి ఇంకా ఆ ముప్పు లేదని అనుకున్నారంతా.. ఒకటీ అరా కేసులు బయట పడుతున్నా ఎక్కడా పెద్దగా ఎవరికీ ముప్పు లేదు. అయితే తాజాగా ఒక్కరోజే మొత్తం 10 ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ఏపీలో అలజడి రేగింది. కొత్త వేరియంట్ ఏపీని కూడా చుట్టుముడుతున్నట్టు అర్థమవుతోంది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 16కి చేరింది.
కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు వివరించారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.