ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ఆంక్షల వలయంలోకి వెెళ్లిపోయింది. నైట్ కర్ఫ్యూతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక, మెట్రో రైళ్లు, బస్సులను 50శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి కన్పించారు.
ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు వేచి చూస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉన్నాయి.
A masterstroke decison by Delhi govt against covid new variant???????#COVID19 #delhimetro @ArvindKejriwal @OfficialDMRC @AamAadmiParty pic.twitter.com/jooC8Zlv0V
— Anand kr choudhary (@Akc704266) December 29, 2021