మట్టిలో తిరగొద్దు, దుమ్మ ధూళి సోకితే.. మీ చర్మం నిగారింపు కోల్పోతుంది అంటుంటారు చాలామంది. కానీ కావాలని అందం కోసం ఎవరైనా మట్టి పూసుకుంటారా. అవును, దానిపేరు ముల్తానీ మట్టి. చాలామందికి ఇది పరిచయమే అయితే ముల్తానీ మట్టిని ఎలా తయారు చేస్తారో తెలుసా.?
పసుపు, రోజ్ పౌడర్, నారింజ తొక్క పొడి, గంధపు పొడి.. నుంచి సహజసిద్ధమైన ముల్తానీ మట్టిని తయారు చేస్తారు. ముఖ్యంగా ముల్తానీమట్టిలో చాలా సుగుణాలున్నాయి. ఇది హానికర నూనెలను గ్రహించి, మొటిమలను దూరం చేస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తుంది.
దీని వాడకం కూడా చాలా సులభం. ముల్తానీ మట్టిలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేయాలి. దాన్ని ముఖంపై, మెడపై రాసుకొని, పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆపైన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ పూయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, చర్మ సమస్యలు తగ్గుతాయి.