మాజీ అందాల రాణులు కబీర్, షాజన్ ఇద్దరు ఒక రోడ్డు ప్రమాదంలో దారుణంగా చనిపోయారు. మిస్ కేరళ పోటీల్లో అన్సీకబీర్ మొదటిస్థానం కాగా, రెండవ స్థానంలో అంజనా షాజన్ నిలిచారు. అందాల పోటీల్లో మొదటి, రెండు స్థానాలు దక్కించుకున్న వీరిద్దరూ మంచి స్నేహితులు, బంధువులు కావడం విశేషం.
వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు కేరళలో వైతిల్లా అనే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే అందాలరాణులు ఇద్దరూ చనిపోగా, మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఒక మోటార్ సైకిలిస్టును ఢీకొన్న వీరి కారు, ఆ తర్వాత తిరగబడి ప్రమాదానికి గురైంది. అతివేగమే ఈ దారుణ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.