డాబాముందు కూర్చుని ఫ్రెండ్స్ తో మందు కొడుతున్న వ్యక్తి , పెట్రోలింగ్ పోలీస్ సైరెన్ తో భయపడి ప్రాణాలు పోగోట్టుకున్నాడు. పొనగంటి వేణు అనే వ్యక్తికీ పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. జమ్మికుంటలో ఉంటున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వేణు , జమ్మికుంట రోడ్డుపక్కన డాబాలో , ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి , మందు కొడుతున్నాడు. అంతలో పోలీసు వ్యాన్ సైరెన్ కొట్టుకుంటూ వచ్చింది. మందు కొడుతున్న ఫ్రెండ్స్, పోలీసులు పట్టుకుంటారని , భయపడి పరుగులు తీశారు. వేణు కూడా డాబా వెనుకనుంచి పరుగు తీసి , చీకట్లో నేలబావిలో పడ్డాడు. బావిలో పెద్ద శబ్దం వినిపించడంతో , అక్కడున్నవాళ్ళు వెంటనే , బావిదగ్గరకెళ్ళి , రక్షించే ప్రయత్నం చేసారు. అయితే అప్పటికే వేణు చనిపోయాడు..