మా ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు మీడియాలోనే చూశానని , అవి ఇంతవరకు తనకు అందలేదని , మా కొత్త అధ్యక్ధుడు విష్ణు అన్నారు. సోమవారం ఉదయం తన మా ప్యానెల్ సభ్యులతో కలిసి , తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు
. తండ్రి , మోహన్ బాబు కూడా వారితో ఉన్నారు. నిజంగా రాజీనామాలు అందితే ఏమిచేయాలో నిర్ణయించుకుంటామని చెప్పారు. మోహన్ బాబు మాట్లాడుతూ , మా అధ్యక్షుడు స్థానం చాలా గౌరవప్రదమైనదని అన్నారు. విష్షు గెలుపుతో , ఒక బాధ్యతాయుతమైన రీతిలో పనిచేయాలని అన్నారు.
దర్శనం తరువాత ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు, బాబూమోహన్ , శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.