విధి విచిత్రమైనది. మనిషి తలరాతను విధాత ముందే నిర్ణయిస్తాడు. ఒక్కోసారి అది మనిషి కూడా ముందుగానే అర్ధమవుతుందేమో. తమ రాతను కూడా వారే రాసేసుకుంటారు. అందుకు నిదర్శనమే ఇది. కేరళలోని కోచీ ప్రాంతంలో 2019 మిస్ కేరళ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పల్టీలు కొట్టడంతో, స్పాట్ లోనే వీరిద్దరూ చనిపోయారు. అయితే వీరు చనిపోయే ముందు అన్సీ కబీర్ తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన చివరి వీడియో వైరల్ గా మారింది. పచ్చని గార్డెన్ లో అన్సీ నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తున్న ఆ వీడియోకి, బ్యాగ్ గ్రౌండ్ లో ఇట్స్ టైం టు గో అనే సాంగ్ యాడ్ చేసింది. అదే తన చివరి ప్రయాణం అన్నట్లుగా సాగిన ఈ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత… విధిరాతకు తలవంచుతూ యాక్సిడెంట్ లో చనిపోయింది అన్సీ కబీర్.
View this post on Instagram