టెన్త్ బాలికపై అత్యాచారం-నిందితుడి కాల్చివేత.

    0
    712

    టెన్త్ క్లాస్ అమ్మాయిపై దారుణంగా అత్యాచారంచేసి , ఆ బాలిక మరణానికి కారణమైన లఖన్ అనే యువకుడిని పోలీసులు ఎదురుకాల్పుల్లో చంపేశారు. అమ్మాయి , ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా , లఖన్ తన ముగ్గురు స్నేహితులతో ఆ బాలికను కిడ్నాప్ చేసి , సామూహిక అత్యాచారంచేశాడు. ఇంటికొచ్చిన బాలిక జరిగిన ఘోరాన్నిచెప్పి విషం మింగింది. దీంతో అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించగా , వైద్యం అందేలోగా చనిపోయింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డవారి పేర్లు రాసి , ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ప్రధాన నిందితుడు , లఖన్ తో పాటు మరో యువకుడిని పోలీసులు కోర్టుకు తీసుకుపోతుండగా , పోలీసులనుంచి తుపాకిలాక్కొని , వారిని చంపేందుకు ప్రయత్నం చేయడంతో జరిగిన కాల్పుల్లో లఖన్ చనిపోయాడు.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిందీ సంఘటన.

     

    ఇవీ చదవండి

    ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

    నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

    మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

    సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు