గుండు బాస్, : డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావు.

    0
    803

    నాలుగు హోట‌ళ్ళు తిర‌గండి…
    ఎక్క‌డ రేటు త‌క్కువ ఉంటే అక్క‌డే దోశ‌లు తినండి…
    =================
    డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అంటూ ఫేమ‌స్ అయిన ల‌లితా జ్యుయెల‌రీ అధినేత కిర‌ణ్ కు చెందిన ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఎప్పుడూ న‌గ‌ల దుకాణంలోనే క‌నిపించే మ‌న గుండు బాస్ ఉన్న‌ట్టుండి నెల్లూరులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఓ టిఫిన్ బండి ముందు ప్లేట్ ప‌ట్టుకుని నెల్లూరు స్పెష‌ల్ కారం దోశ‌లు తింటూ క‌నిపించాడు. ఈ ఫోటో ఇప్పుడు వైర‌ల్ అయింది.

    ల‌లితా జ్యుయెల‌రీ అధినేత కిర‌ణ్ త‌న వ్యాపారాన్ని కూడా వినూత్నంగా ప్ర‌చారం చేసుకుంటూ ఉంటాడు. త‌న కంపెనీకి తాను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారి ప్ర‌మోష‌న్స్ చేస్తుంటాడు. నాలుగు షాపులు తిర‌గండి. ఎక్క‌డ ధ‌ర త‌క్కువ ఉంటే అక్క‌డే న‌గ‌లు కొనుక్కోండి అంటూ ఆడ‌వారిని ఆక‌ట్టుకుంటాడు.

    దీన్ని ఆస‌రాగా చేసుకున్న నెటిజ‌న్లు స‌ర‌దాగా గుండు బాస్‌ని ఆడేసుకుంటున్నారు. నెల్లూరులో నాలుగు హోట‌ళ్ళు తిర‌గండి… ఎక్క‌డ దోశ‌లు ధ‌ర‌లు త‌క్కువ ఉంటే అక్క‌డే తినండి. అంటూ సోష‌ల్ మీడియాలో క్యాప్ష‌న్లు పెట్టి షేర్ చేస్తున్నారు. డ‌బ్బులు ఊరికే రావు అంటూ వాట్స‌ప్‌లో స్టేట‌స్‌లు పెడుతూ న‌వ్వుకుంటున్నారు.

    నీతి : డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావు

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.