ఏదో అలా అన్నా..పట్టించుకోవద్డు.

    0
    723

    తెలంగాణ మంత్రి కేటీఆర్ , ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల గురించి చేసిన దారుణమైన వ్యాఖ్యలుపై వివరణ ఇచ్చాడు. రాత్రి 12 గంటలకు ఆయన తన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ , అవి ఏదో అన్యాపదేశంగా అన్నానని , వాటివెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు గౌరవమని , ఇక ఏ వివాదానికి ముగింపు ఇద్దామని అన్నారు. హైదరాబాదులో జరిగిన క్రెడాయ్ పెట్టుబడుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అందువల్ల పెట్టుబడులకు , వ్యాపారాలకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన అని చెప్పుకొచ్చారు .

    ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు లేదని ,నీళ్లు లేవని ,రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ఇటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవని తమ రాష్ట్రం చాలా బాగుందని అన్నారు. పక్క రాష్ట్రం గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ,రెండు రాష్ట్రాల మధ్య బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణకు వస్తే రిలీఫ్ గా ఫీలవుతుందని చెపుతున్నారు అని కూడా.

    కేటీఆర్ వ్యాఖ్యలపై , ఏపీ లోని మంత్రులు వెంటనే ధ్వజమెత్తారు. దీంతో పరిస్థితి ముదిరిపోకుండా , కేటీఆర్ ఈ వివాదం ముగించాలని , సమాధానం ఇచ్చారు.. కేటీఆర్ , కేసీఆర్ , జగన్ 12నెలల క్రితం వరకు సంబంధాలు బాగానే ఉండేవి . ఇద్దరూ ఒకరికొకరు పొగుడుకునేవారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన తిరుగుతోంది . పాదయాత్రలో కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. దీంతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే క్రెడాయ్ సమావేశంలో పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అని , అసలు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులుకు కానీ అది అనుకూలమైన రాష్ట్రం కాదని అంటూ దుమ్మెత్తి పోయడం విశేషం . ఇప్పుడు దాన్ని సర్దుకున్నా , ఇద్దరిమధ్య సంబంధాలు బాగాలేవని చెప్పడానికి ఇదో నిదర్శనం..

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.