కిన్నెర మెట్ల సంగీత కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న , మొగిలయ్య , పేదరికంలో కూడా , తన తరంలో ఆఖరివాడుగా , కిన్నెరమెట్ల వాయిద్యంతో , తెలంగాణాలో ఆ కళను బతికించాడు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కిన్నెరమెట్ల వాయిద్యం, మొగిలయ్య సంగీత కళ ప్రచారంలోకి వచ్చాయి. మొగిలయ్యకు కేంద్రం కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్న మొగిలయ్యకు , కోటిరూపాయల డబ్బుతో పాటు , ఇంటిస్థలం కూడా మంజూరు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , మొగిలయ్యను తన కార్యాలయానికి పిలిపించి వీటిని అందజేశారు..