బాలీవుడ్ లో కుర్రకారు గుండెల్లో గునపాలు దింపుతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ , త్వరలో తెలుగు సినిమా ప్రాజెక్ట్ చేయబోతొంది.. జూనియర్ ఎన్టీఆర్ తో , బుచ్చిబాబు తీయబోయే సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందట. ఈ మేరకు ఆమెతో ఒక రౌండ్ టాక్స్ పూర్తిఅయినట్టు చెబుతున్నారు.
ఇదే జరిగితే జాన్వీ – జూనియర్ జంట తెలుగులో హిట్ పెయిర్ అవుతుందని కూడా భావిస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల కంటే , తన అందచందాలను సోషల్ మీడియాలో అందరికీ కనువిందు చేయడంలో జాన్వీ కపూర్ దే , అగ్రస్థానం.. ఆమె అంగాంగ సౌష్టవం , తెలుగు తెరపై , జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కనువిందు చేసే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు.
జాన్వీ కోసం ఇదివరకే రెండు తెలుగు సినిమా ప్రాజెక్టులు రెడీ అయ్యాయి.. ఎందువల్లనో వాయిదా పడ్డాయి. జాన్వికూడా , తనకు దక్షిణాది సినిమాల్లో , ముఖ్యంగా తెలుగు సినిమా చెయ్యాలని ఆశగా ఉందని చెప్పింది. తెలుగు తెరపై తన తల్లి శ్రీదేవి , మకుటంలేని మహారాణిగా వెలిగిన సంఘటనలు కూడా గుర్తుకుతెచ్చుకుంది..