ఐటీ అధికారుల దాడుల్లో డబ్బులు, నగలు బయటపడటం సహజమే. అయితే కొన్నిసార్లు వారు షాకయ్యే స్థాయిలో డబ్బు బయటపడుతంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా కట్టలు కట్టలుగా డబ్బుల గుట్టలు బయటపడటంతో ఐటీ అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది.
समाजवादियों का नारा है
जनता का पैसा हमारा है!समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt
— Sambit Patra (@sambitswaraj) December 24, 2021
కాన్పూర్ కు చెందిన అత్తరు తయారీ సంస్థ చాన్నాళ్లుగా పన్ను ఎగ్గొడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. దాదాపు 24గంటల సేపు ఈ ప్రాసెస్ జరిగింది. మొత్తం రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్క కొనసాగుతూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న జీఎస్టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పీయూష్ జైన్ సమాజ్వాదీ పార్టీ నేత కూడా కావడంతో అక్కడ బీజేపీ.. సమాజ్ వాదీ పార్టీపై ఆరోపణలు ఎక్కు పెట్టింది.