ఇంటర్ పరీక్షకు వెళ్తున్న లక్ష్మీదేవి.. బస్సు రిపేర్ కావడంతో.. చివరకు..

    0
    431

    బస్సు ఆలస్యం కావడంతో ఆ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
    తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన అమలులో ఉంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి రానీయట్లేదు అధికారులు. చాలా చోట్ల విద్యార్థులు ఈ నిబంధనతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీదేవి ఎకనామిక్స్‌ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌ నుంచి బస్సులో బయల్దేరింది. ఆ బస్సు మధ్యలో రిపేర్ వచ్చింది. దీంతో ఆమె పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది.

    నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీదేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్‌ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని అధికారులకు చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో లక్ష్మీదేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్‌ నాయక్‌ ఆమెకి సర్ది చెప్పి పంపించారు.

    ఇవి కూడా చదవండి..

    ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..